Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedమాదాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు

మాదాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు

 

నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, జూన్ 11 (ముడికే రమేష్ యాదవ్):

గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో భూ భారతిలో భాగంగా రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తహసిల్దార్ జె నరేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేపట్టిన భూభారతి ఆర్వో ఆర్ చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, రైతులు తమ సమస్యలను రెవెన్యూ సదస్సులో అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాదాపూర్ గ్రామంలో భూ సమస్యలపై 76 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో జే నరేందర్ ఆర్ ఐ రజనీకాంత్ రెడ్డి పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments