(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం 
కొల్లాపూర్ జూన్ 12.(నేటి సత్యం ప్రతినిధి:యస్.పి.మల్లిఖార్జున సాగర్)
కొల్లాపూర్ మున్సిపల్ పరిధి లోని 12 వ వార్డు నివాసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరెల్లి మహేష్ మాతృమూర్తి బోరెల్లి ఎల్లమ్మ (70, భర్త బోరెల్లి సంగేo) గత కొంత కాలం గా అనారోగ్యం తో చికిత్స పొందుతూ బుధవారం రోజు రాత్రి కొల్లాపూర్ పట్టణం లో మరణించారు.
విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి, కొల్లాపూర్ శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు గురువారం ఉదయం మృతురాలు బోరెల్లి ఎల్లమ్మ ఇంటికి వెళ్లి ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించి తన ప్రగాఢ సంతాపం ను ఎల్లమ్మ భర్త బోరెల్లి సంగెం, ఎల్లమ్మ కుమారుడు బోరెల్లి మహేష్ లకు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమ నాయుడు, మేకల కిషోర్ యాదవ్, పుట్ట పాగ చిన్న రాముడు తదితరులు పాల్గొన్నారు.