భారత్ బంద్
*రేపు భారత్ బంద్* కేంద్ర విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాల ఐక్య వేదిక బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, నిర్మాణం వంటి రంగాలకు చెందిన కార్మికులు బంద్ లో పాల్గొంటున్నారు. ఈ సమ్మెలో రైతులు సహా 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారని ఐక్య వేదిక తెలిపింది. పదేళ్లుగా కేంద్రం వార్షిక కార్మిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదని, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపించింది.