(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం. శంషాబాద్ జూలై 8
*100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)*
*షాద్నగర్ నియోజకవర్గంలో ఫరూక్నగర్ మండల 6వ మహాసభ*
*అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ .భూదాన భూములు భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్*
.
రోజురోజుకు ప్రభుత్వ భూములు మరియు భూదాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశాడు
మంగళవారం నాడు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన పెన్షనర్స్ హాల్ లో జరిగిన సిపిఐ ఫరూక్నగర్ మండల 6వ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు మరియు భూదాన భూములు ఇతర మిగులు భూములో అసైన్డ్ భూములు వేలాది ఎకరాలు ఉన్నాయని ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం వల్ల భూ కబ్జాదారులు యదేచ్చగా ఆ భూములను ఆక్రమించుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు
సిపిఐ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలను రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన పట్టణ కేంద్రాలలో విస్తృతంగా సంబరాలను నిర్వహించాలని సిపిఐ చరిత్రను ప్రజలకు తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సిపిఐ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి ఆనాటి బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో విప్లవద్యమాలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు ప్రజలు ఆందోళన పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు
రాబోయే కాలంలో జిల్లావ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించి ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలను గుడిసెలు వేయించి భూ పోరాటం నిర్వహిస్తామని ఆయన తెలిపారు
ఈ మహాసభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు ఫరూక్నగర్ మండల నిర్మాణ బాధ్యులు జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీను గారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య చంద్రబాబు గోవింద నాయక్ రమేష్ రాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు
నూతన కమిటీ ఎన్నిక
మండల కార్యదర్శిగా లింగం నాయక్ సహాయ కార్యదర్శి పవన్ చౌహాన్ రమేష్ వీరితోపాటు 9 మంది కార్యవర్గం 21 మందితో కౌన్సిల్ సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టు జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య ప్రకటించారు
