Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedరాజ్యాంగ హక్కులను కాల రాస్తున్న బిజెపి సంగ్ పరివార్

రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్న బిజెపి సంగ్ పరివార్

*రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న బీజేపీ, సంఘ పరివార్*

నేటి సత్యం. హైదరాబాద్. జూలై 13
*పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలి*

*ఇజ్రాయిల్ జాత్యహంకార దాడులకు బిజెపి, బిజెవైఎం మద్దతు సిగ్గుచేటు*

*దాడికి యత్నించిన బీజేవైఎం దుండగులను అరెస్ట్ చేయాలి*

*-ఏఐఎస్ఎఫ్ జాతీయ నేతలు*

*ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా*

హైదరాబాద్ : పాలస్తీనా ప్రజలపై సామ్రాజ్యవాద అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ చేస్తున్న మారణ హోమ దాడులను, మానవ హక్కుల హననం తక్షణమే ఆపి శాంతిని నెలకొల్పాలని ఏఐఎస్ఎఫ్ చేస్తున్న శాంతియుత ఆందోళనను చేస్తుంటే సంబంధం లేని బీజేవైఎం, బీజేపీ, సంఘ పరివార్ దుండగులు దాడి చేయడం సిగ్గు చేటని, దాడికి యత్నించిన దుండగులను అరెస్ట్ చేసి రాజ్యంగ హక్కులను కాపాడాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ లు అన్నారు.

ఆదివారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ వద్ద ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి ఆధ్వర్యంలో నిన్న ఏఐఎస్ఎఫ్ నాయకులపై బీజేవైఎం, బీజేపీ, సంఘ పరివార్ దుండగుల దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ మాట్లాడుతూ నాగోల్ బండ్లగూడ లోని నవ చేతన విజ్ఞాన కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణా తరగతుల సందర్భంగా పాలస్తీనా పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న మారణకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ నిన్న నవ చేతన విజ్ఞాన కేంద్రం రోడ్డు ముందు నిరసన కార్యక్రమం చేపడితే, దుష్ట బీజేపీ దాని అనుబంధ సంఘం అయిన బీజేవైఎం, సంఘ పరివార్ దుండగులు అక్రమంగా, దుర్మార్గంగా ఏఐఎస్ఎఫ్ నాయకులను నిరసన చేయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సిగ్గు చేటని, బీజేపీ దాని అనుబంధ సంఘాలు నీచ పన్నాగాలు తెరలేపారని దుయ్యబట్టారు. ప్రపంచ శాంతిని కోరుకునే ఏఐఎస్ఎఫ్, వామపక్ష సంఘాలపై విషాన్ని వెదజల్లి ఇబ్బందులకు గురిచేయాలని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలుచేయాలనే నీచ సంస్కృతికి ఆజ్యం పోస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేసే హక్కును అడ్డుకోవడం బీజేపీ ఎజెండానా అని వారు ప్రశ్నించారు. దాడులకు పాల్పడితే తాము చూస్తూ ఊరుకునేది లేదని, తాము కూడా ప్రతి దాడులకు పాల్పడే ధైర్యం ఉందని, కానీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు గుర్తొస్తున్నాయని, అందుకే సంయమనం పాటిస్తున్నామని వారు అన్నారు. దాడికి యత్నించిన బీజేవైఎం, బీజేపీ, సంఘ పరివార్ నేతలను గుర్తించి పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్స్ అమిత్ హంజా, సంఘ మిత్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్, జాతీయ జాతీయ కార్యవర్గ సభ్యులు నాసార్ జీ, వైభవ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు బానోతు రఘురాం, గ్యార నరేష్, గ్యార క్రాంతి, సాయి కుమార్, ఫణి, ప్రతిక్ష మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments