నేటి సత్యం

*న్యూఢిల్లీ: 25-07-2025*
*ఓబీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని..కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల డిమాండ్.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు రేపు అనగా 25-07-2025 శుక్రవారం రోజున జరిగే ఛలో ఢిల్లీ.. భాగీదారీ న్యాయ సమ్మేళనం- కాంగ్రెస్ పార్టీ OBC విభాగం లో భాగంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇతర నేతలతో, నాయకులతో కలిసి పాల్గొన్న కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, కుల గణన సర్వే శాస్త్రీయబద్ధంగా చేసిన తీరుపై సమీక్షా సమావేశం జరిగిందన్నారు.*
*నేటి పరిస్థితుల్లో సామాజిక, విద్య మరియు ఆర్థికంగా OBCల అభివృద్ధి కోసం ఉద్యమం అవసరమని పేర్కొన్నారు.*
*దీనికోసం రాష్ట్రం పంపిన బిల్లులు ఆమోదానికి కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.*