నేటి సత్యం

*మహిళాభ్యుదయానికి పెద్దపీట*.
*ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి*
నేటి సత్యం. నగర్ కర్నూల్. జులై 25
నాగర్ కర్నూల్… రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళాభ్యుదయానికి పెద్దపీట వేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అన్నారు శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి విజయవంత సదస్సుకు డిఎం యాదయ్య గారు అధ్యక్షత వహించగా పలువురు మహిళలు విద్యార్థులు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో వివరించారు. పలు పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పెయింటింగ్ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు. 200 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు 6680 కోట్లు చెల్లించడం జరిగిందని వివరించారు. వంటింటికే పరిమితమైన మహిళలు ఈ పథకం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లి చిరు వ్యాపారం చేసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు మహిళలను కోటీశ్వరులు చేసేందుకు పెట్రోల్ పంపులు నిర్వాణతో పాటు బస్సులను కొనుగోలు చేసేందుకు రుణాలను మహిళా సంఘాలకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఈ పథకం ద్వారా ఆర్టీసీ బలోపేతం కావడంతో పాటు మహిళలు కూడా ఆర్థికంగా ప్రయోజకులుగా మారుతున్నారని ఆయన వివరించారు
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బందితోపాటు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు