Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 10:13 am Editor : Admin

ఓబిసి బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*ఓబీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని..కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ బీసీ సంఘాల డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీ లోని భాగిదారి న్యాయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్*

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఛలో ఢిల్లీ భాగీదారీ న్యాయ సమ్మేళనం- కాంగ్రెస్ పార్టీ OBC విభాగం లో భాగంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇతర నేతలతో, నాయకులతో కలిసి పాల్గొన్న కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కుల సర్వే విధివిధానాలు, కుల గణన సర్వే శాస్త్రీయబద్ధంగా చేసిన తీరుపై సమీక్షా సమావేశం జరిగిందన్నారు.

నేటి పరిస్థితుల్లో సామాజిక, విద్య మరియు ఆర్థికంగా OBCల అభివృద్ధి కోసం ఉద్యమం అవసరమని పేర్కొన్నారు.

దీనికోసం రాష్ట్రం పంపిన బిల్లులు ఆమోదానికి కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.