Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

*ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా.*

– తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

నేటి సత్యం/మరికల్: జులై 26

తెలంగాణ భగత్ సింగ్ ఆటో కార్మిక సంగం అధ్ర్వర్లో ధర్న కార్యక్రమం శనివారం చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పి. వెంకటేష్ మాట్లాడుతూ అటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని ఆయన కోరారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో కార్మికులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అని రోజంతా శ్రమించిన బతుకు బండి లాగడం ద్వారా
ఇబ్బందికరమైన జీవితం గడుస్తుంది
కావున రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఆటో కార్మికులకు 12000 వేల రూపాయలు ఎన్నికల ముందు ఇస్తామన్న హామీ వెంటనే అమలుచేయాలి ఆయన కోరారు. ఆటో కార్మికుడు రోడ్డు పై ప్రయాణిస్తున్నప్పుడు మూర్తి చేదితే 1000000 రూపాయలు వెంటనే అందచేయాలి. అంగవైకల్యం ప్రభుత్వం ద్వారా 500000 రూపాయలు అందచేయలి అని ఆయన కోరారు….
ఇట్టి కార్మికులకు *పీఎఫ్* *ఈస్ఐ ,అయిడెంట్ కార్డు* అందచేయని అని ఆయన కోరారు. అనంతరం మరికల్ తాసిల్దార్ రామకోటికి ఆటో కార్మికుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆటో కార్మికులు గుడిసె కురుమన్న, వడ్ల సంతోష్, కుమార్, వి. కిషోర్ నాయక్, బి. కురుమన్న, కే. రాజారెడ్డి, అంజి, శ్రీకాంత్, కే. కృష్ణయ్య బి. ఆంజనేయులు, నర్సింలు గౌడ్, ఎల్. మహేందర్, టి చెన్నప్ప టి శ్రీను, కాజా, మహేందర్, బ్రహ్మానందరెడ్డి, శ్రీను, రాములు గౌడ్, కేశవులు, తదితర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments