Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 5:01 pm Editor : Admin

రాజ్యాధికారమే లక్ష్యం బీసీ ఐక్యవేదిక




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేర్లింగంపల్లి జూలై 29

*రాజ్యాధికారమే లక్ష్యంగా బోడె రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీలంతా హాజరుకావాలని పిలుపునిచ్చిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్*
రాజ్యాధికారమే లక్ష్యంగా… బడుగుల బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, బీసీ జాబితా నుంచి తొలగించిన 26+1 బీసీ కులాల గొంతుకను వినిపించడానికి.. బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఈ సమావేశానికి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బీసీల రాజ్యాధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలో చర్చించుకుని బీసీల సమేతంగా పోరాటం చేయాలని అన్నారు. బీసీల ఐక్యమత్యమే బీసీల రాజ్యాధికారం అన్నారు. బీసీలందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్నారు.

వేదిక: హోటల్ వైష్ణవి గ్రౌండ్, కళామందిర్ రోడ్డు, KPHB కాలనీ, కూకట్ పల్లి, హైదరాబాద్.
తేదీ: జూలై 30, బుధవారం సాయంత్రం 6 గంటలకు.