నేటి సత్యం. ఆగస్టు 8
ఎటుపోతోంది సమాజం…
కూతురిని రూ.5 వేలకు విక్రయించిన కసాయి తండ్రి..
తాగుడుకు బానిసైన ఓ కసాయి తండ్రి ఏకంగా మూడేళ్ల వయసున్న కూతురిని రూ.5 వేలకు విక్రయించి.. అనంతరం కిడ్నాప్, తప్పిపోయిందని నాటకాలాడాడు.
ప్రభుత్వ రైల్వే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిపోయాడు. ప్రభుత్వ రైల్వే పోలీసులు గంటల వ్యవధిలోనే చిన్నారిని రక్షించి తల్లికి అప్పగించారు.
విక్రయించిన తండ్రి, కొన్న ఇద్దరు కటకటాలపాలయ్యారు. విజయవాడ రైల్వేస్టేషన్ ఈ ఘటన జరిగింది.