Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedతెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి కె రామస్వామి

తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి కె రామస్వామి

నేటి సత్యం

*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి*

*సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి*

నేటి సత్యం చేవెళ్లే. సెప్టెంబర్ 5

ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని ఈరోజు సిపిఐ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం అనేది 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఏడవ నిజాం మీరు ఉస్మాన్ ఆలీ కానుక వ్యతిరేకంగా జరిగిన సాయిధ తిరుగుబాటు అని ఈ పోరాటంలో దాదాపు 4500 మంది తెలంగాణ రైతులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ పోరాటం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు నిజాం పాలనను అంతం చేసి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఈ పోరాటం దారితీసిందని భూస్వాముల దోపిడీని నిలిపి రైతుల హక్కులను కొంతమేరకైనా పరిరక్షించారని ఈ పోరాట స్ఫూర్తితోనే ఈనెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదులోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ముగింపు సభ ఉంటుందని ఈ సభకు పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్ ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments