Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 7:01 am Editor : Admin

రేవంత్ రెడ్డి పై పరువునష్టం దవా కోట్టి వేసిన సుప్రీం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా కేసును కొట్టివేసిన సుప్రీం*

* రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ భాజపా దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేయడంపై భాజపా పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో ఇదే విషయమై ఆ పార్టీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను భాజపా సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. తాజాగా వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.