నేటి సత్యం సెప్టెంబర్ 11 
*ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మేల్యే రాజేష్ రెడ్డి*
నాగర్ కర్నూల్ పట్టణం సాయి గార్డెన్ నందు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IJU) వారి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో జర్నలిస్ట్ ల కుటుంబాలకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు అలాగే ఈ హెల్త్ క్యాంప్ ను అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆయన సూచించడం జరిగింది.
వారితో పాటు ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ప్రముఖ జర్నలిస్టు లు పాల్గొనడం జరిగింది.