(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం.చేవెళ్ల
*ప్రభుత్వ భూములను కబ్జా దారుల నుండి పరిరక్షించండి*
*సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం*
*సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం ప్రభు లింగం* 
చేవెళ్ల మండలంలోని న్యాలట గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 240 గల భూమిని కొంతమంది భూకబ్జాదారులు కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేసి క్రయవిక్రయాలు చేస్తున్నారని అసలైన నిరుపేదలకు కేటాయించబడిన ఇండ్ల స్థలాలు కబ్జాకు గురి అవుతున్నాయని ఈరోజు రామన్నగూడెం సిపిఐ గ్రామ కార్యదర్శి పాపయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ప్రభుత్వ భూమిని కబ్జా దారుల నుండి కాపాడలని ప్రభుత్వ అధికారులు వెంటనే ఆ స్థలాన్ని పరిశీలించి గతంలో ప్రభుత్వము ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు పరిశీలించి ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయించాలని ఈరోజు స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎం సుధాకర్ గౌడ్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు శివ గ్రామ శాఖ కార్యకర్తలు కిష్టయ్య అంజయ్య సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు