(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*
హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం: పొంగులేటి._*
నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 24
_తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై నవంబర్ 3న హైకోర్టు తీర్పు వెలువడనుందని.. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనిపై నవంబర్ 7న మరోసారి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆర్డినెన్స్ ను త్వరలోనే గవర్నర్ కు పంపనున్నట్లు వెల్లడించారు._