Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeHyderabadతెలంగాణ డిజిపి ముందు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న లొంగుబాటు

తెలంగాణ డిజిపి ముందు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న లొంగుబాటు

నేటి సత్యం మాది లొంగుబాటు కాదు – చంద్రన్న

ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశాము, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తామనీ మావోయిస్టు సీనియర్ నేత చంద్రన్న అన్నారు.

ఇవాళ మరో సీనియర్ నేత బండి ప్రకాష్ తో తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదన్నారు. మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉందనీ, ప్రస్తుతం అనారోగ్య కారణం వల్ల ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నాననీ అందుకే పార్టీ నుండి బయటకు వచ్చామని అన్నారు.

ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్ జీ కొనసాగుతున్నాడనీ, సిద్ధాంత పరంగా తాను దేవ్‌జిని సపోర్ట్ చేస్తున్నాననీ తెలిపారు. ఉద్యమం లో నుంచి బయటకు వచ్చేముందు ఆయుధాలను పార్టీకి ఇచ్చి వచ్చాననీ అన్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఏమీ ఆశించడం లేదన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments