Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaరంగారెడ్డి జిల్లా . చేవెళ్ల మండలం లో.. రోడ్డు ప్రమాదం 18 మంది మృతి

రంగారెడ్డి జిల్లా . చేవెళ్ల మండలం లో.. రోడ్డు ప్రమాదం 18 మంది మృతి

నేటి సత్యం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ తాడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ప్రమాద స్థలం . చేరుకొని మూడు జెసిబిల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు కంకరలో కురుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వివరాలలోకి వెళితే తాడూరు నుంచి హైదరాబాదుకు సుమారు 70 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టింది.

ప్రమాదం తీవ్రతకు టిప్పర్ లోని కంకర మొత్తం బసు పై పడిపోయింది దీంతో బస్సులోని ప్రయాణికులు కంకర రాళ్ల కింద చిక్కుకుపోయి ఊపిరి అడగా ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు ప్రమాదానికి గురైన వాళ్ళు ఎక్కువమంది విద్యార్థులు ఉద్యోగులు ఉన్నారు ఆదివారం సెలవు కావడంతో తమ స్వస్థలoకు వెళ్లి తిరిగి సోమవారం ఉదయం హైదరాబాదుకు వస్తున్నగా ఈ విషాదం జరిగింది మృతుల్లో హైదరాబాద్. లో వాళ్ళు కళాశాలలో చదువుతు న్న విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల్లో 15 నెల చిన్నారి కూడా ఉంది తల్లి బిడ్డలు రోడ్డుపై ఉంచిన దృశ్యం లు కన్నీరు తెప్పించాయి. ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని సమాచారం ఘటన స్థలంలో ప్రయాణికుల అర్దనాల తో బీకారా వాతావరణం నెలకుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments