Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogహైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం కృషి

హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం కృషి

నేటి సత్యం.హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ రహిత రాజధానిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టిగా కృషి చేస్తున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *బండి రమేష్* గారు పేర్కొన్నారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం మంత్రి వాకిటి *శ్రీహరి* గారి తో కలిసి వెంగళరావు నగర్, మధురానగర్లలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కరపత్రాలను పంపిణీ చేస్తూ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తున్నామని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రమేష్ గారు పేర్కొన్నారు.యువత ఉద్యోగాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన తెలిపారు . ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తూము వేణు, మేకల రమేష్, ప్రవీణ్ కుమార్ ,సతీష్ గౌడ్ ,అస్లాం ,కృష్ణ రాజ్ పుత్, అరుణ్ దితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments