నేటి సత్యం పాల్వంచ. నవంబర్ 5
ఎస్టి జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కుట్రలు, కుతంత్రాలు మరియు అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మ్మెల్యే తెల్లం వెంకట్రావు సోయం బాబురావులను సస్పెండ్ చేయాలని,అదేవిధంగా వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏఐసీసీ భవనం ముందు నిరసన ధర్నా,వినతి పత్రం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ అనిల్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ కుమార్ నాయక్,మండల అధ్యక్షుడు రాంబాబు నాయక్,కార్యదర్శి సురేష్ నాయక్,జిల్లా నాయకులు ఇస్లావత్ కిషోర్ నాయక్,రాములు నాయక్,శేఖరంబంజారా లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు సందీప్ నాయక్,ప్రదీప్ నాయక్,కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.