(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*సైబర్ నేరాలపై అప్రమతంగా ఉండాలి ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్ర భాను*
నేటి సత్యం న్యూస్ నవంబర్ 10 (మాన్ సింగ్) రిపోర్టర్ భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బోడ్ రోడ్డు సెంటర్ వరకు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు సోమవారం ఉదయం మండల కేంద్రంలోని 9వ మైల్ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) నీ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు డిఎస్పి హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ మోసగాళ్ల ఉచ్చు లో పడవద్దు అని సూచించారు బ్యాంక్ ఖాతా ఏటీఎంస్ పిన్ నెంబర్లు ఓటిపి వివరాలు చెప్పవద్దన్నారు బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావద్దని సూచించారు సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు 1930కు కాల్ చేయాలని సూచించారు వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు బ్యాంకు తరపున మాట్లాడుతున్నాం మీకు బ్యాంకు లోన్ ఇస్తామని నమ్మించడానికి చూసి మన దగ్గర అమౌంట్ లాక్కుంటారు కాబట్టి అటువంటి వాటిని ఎవరు నమ్మొద్దు అని తెలిపారు ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తో లింకు ఉండడంతో మన సెల్ ఫోన్ నంబర్ కూడా మన బ్యాంకు ఎకౌంటు పాన్ కార్డు ఆధార్ కార్డు పెన్షన్ పౌరసరఫరాల వినియోగదానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని దాని ఆసరాగా చేసుకోని సైబర్ నెరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా ఆయన తెలిపారు గంజాయి మాదకద్రవ్యాలపై టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ గంజాయి మాదక దరువు నిర్ణయించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని సిఐ బత్తుల సత్యనారాయణ అన్నారు గ్రామాల్లో గంజాయి సాగు పాల్పడిన రవాణా చేసిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్ని రద్దు అవుతుంది మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తు నాశనం అవుతుంది మాదకద్రవ్యాల నివారణ నివారణకు సమిష్టిగా కృషి చేయాలని వారు తెలిపారు