Neti Satyam
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 2:33 pm Editor : Admin

ఇజ్జత్ నగర్ బస్తీ సమస్యలను పరిష్కరించండి!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇజ్జత్ నగర్ బస్తీనలో చెత్త. డ్రైనేజీ. సమస్యలను పరిష్కరించండి కాలనీవాసులు
నేటి సత్యం శేర్లింగంపల్లి నవంబర్ 17

మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్ కాలనీ లో డ్రైనేజీ సమస్య చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంది . దగ్గర గత కొంతకాలంగా డ్రైనేజీ పొంగిపొర్లుతుంది . దానితోపాటు రోడ్డుమీద ఎక్కడపడితే అక్కడ చెత్త పడేస్తున్నారు ఈ విధంగా పాడేయడం వల్ల బస్తీలో దోమల బెడద ఎక్కువై ప్రజలకు రోగాలు వచ్చే పరిస్థితి నెలకొన్నది ఇట్టి విషయాన్ని బస్తీ వాసులైన సంఘం చక్రవర్తి మరియు కంటే శివకుమార్ బస్తీ లో నెలకొన్న ప్రజా సమస్యలపై సోమవారం చందానగర్ ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇవ్వడం జరిగింది
హైటెక్ సిటీ ప్రాంతానికి కూత పెట్టు దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్ కాలనీ నిలువెత్తు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే చోద్యం చూస్తున్న అధికారులు పాలకులు.
కాలనీలో రోడ్లను పగలగొట్టి డ్రైనేజ్ చేసినారు. పగలగొట్టిన రోడ్డును మళ్లీ రోడ్డు వేయలేదు మట్టి కొట్టుకపోయి గుంతల మాయంగా మారిన రోడ్లు. బస్తీలో ఎక్కడంటే అక్కడ చెత్త పేరుకుపోయింది. చెత్త ఎత్తుకుపోయే వాళ్లే లేరు బస్తీలో రోడ్లను ఒక్కరోజు కూడా క్లీనింగ్. చేయరు . డ్రైనేజీ పొంగిపొర్లుతుంటే క్లీన్ చేసే నాధుడు కరువైండు. మురికి కంపుగా మారిన రోడ్లు మరియు దోమలు ఈగలు వివిధ రకాల కొత్త రోగాలు వచ్చి మా బస్తీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించండి