Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 9:50 am Editor : Admin

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనగర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం రాజేంద్రనగర్ జోన్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Ci) సత్యనారాయణ గారిని సిపిఐ,ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ గారికి శాలువా కప్పి మర్యాద పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాటేదాన్ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారని వారికి మీ సహాయ సహకారాలు ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్ష , కార్యదర్శులు,టి.ఆనంద్, ఈ.సాయిలు, ఏ.రాజు, మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.