రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయి సీఎం
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజాస్వామిక బద్ధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, ధనసరి అనసూయ సీతక్క గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో...