ప్రపంచ మేధావి ని భారతదేశానికి
అందించిన మాతృమూర్తి “బీమాబాయి”..
కొల్లాపూర్,నేటి సత్యం, డిసెంబర్ 20.
భారత దేశం గర్వించదగ్గ, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు తిప్పుకునేలా కృషి చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను భారత దేశానికి అందించిన మాతృమూర్తి బీమాబాయి అని పెంట్లవెల్లి మండల బి.ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవురాజు అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాతృమూర్తి బీమాబాయి వర్ధంతి సందర్బం గా శనివారం ఆయన బీమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకు నివాళులు అర్పించారు.
నోటికో కోటికో మహనీయులు ఈ భూమిపై ఒకరు పుడతారని అలాంటి మహనీయులలో భారతదేశానికి రాజ్యాంగము ను అందించిన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రప్రదముడు అని భారతదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పెంట్లవెల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు(జి ఆర్) అంబేద్కర్ ను కీర్తించారు.