శంషాబాద్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించాలి అఖిలపక్ష రిలే నిరాహార దీక్ష
శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ప్రకటించాలి: అఖిలపక్ష రిలే నిరాహార దీక్ష శంషాబాద్. డిసెంబర్ 20 గ్రేటర్ హైదరాబాద్లో శంషాబాద్ మండలాన్ని ప్రత్యేక జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శంషాబాద్ మండలం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతం కావడంతో పాటు రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి...