*టేకులపల్లి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనస్మృతి దహన కార్యక్రమం*
*నేటి సత్యం డిసెంబర్ 25*
టేకులపల్లి లోమనిషిని మనిషిగా చూడని మను ధర్మ శాస్త్రం మాకొద్దంటూ 1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేపట్టిన మనుస్మృతి ప్రతుల దహనంను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ 1927 డిసెంబరు 25న అంబేద్కర్ దహనం చేశారని, ఆ రోజును మానవ హక్కుల దినోత్సవంగా జరుపుతున్నట్లు తెలిపారు. . ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కుల, వర్ణ వ్యవస్తను పెంచి పోషించే మనుస్మతి రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేడ్కర్ 1927 డిసెంబర్ 25 న దహనం చేసి మానవ హక్కుల పరిరక్షణ కుడిగా నిలిచారన్నారు. నాటి స్ఫూర్తితో మానవ మనుగడకు అడ్డుగా నిలిచిన మనుస్మతి నీ దహనం చేద్దాం…మానవ హక్కులను కాపాడుద్ధాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ రాష్ట్ర నాయకులు భూక్య శివ నాయక్, ఎమ్మార్పీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంతేన ప్రభాకర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యదర్శి, కాళ్ల రంజిత్, కుంజా నరేందర్ తదితరులు పాల్గొన్నారు