Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaప్రజల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే.

ప్రజల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే.

జనవరి 18వ తేదీన ఖమ్మంలో జరిగే సిపిఐ శతజయంతి ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయండి….

ప్రజల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే*

సిపిఐ పార్టీలో వివిధ పార్టీలకు సంబంధించిన 15 కుటుంబాలు చేరిక*….జనవరి 18వ తేదీన ఖమ్మంలో సిపిఐ పార్టీ శతజయిని ఉత్సవాల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని *సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు*. శుక్రవారం తిరుమలగిరి మండలం మావిడాల గ్రామం x రోడ్ లో జరిగిన తిరుమలగిరి, తుంగతుర్తి మండల సమితి సమావేశం తిరుమలగిరి , తుంగతుర్తి మండలం కార్యదర్శిలు sd ఫయాజ్, పాల్వాయి పున్నయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరై మాట్లాడుతూ అడుగు అడుగున నిర్బంధాలతో, ప్రతినిత్యం శత్రువుల దాడుల మధ్యన జరిగిన పోరాటాల విజయాలు 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్ర 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీగా స్థాపించబడిందని నాటినుండి నేటి వరకు అనేక నిర్బంధాలను ఎదుర్కొని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దొరలు భూస్వాముల గడిలను బద్దలు కొట్టడంలో భారత కమ్యూనిస్టు పార్టీది ముఖ్య పాత్ర వహించింది అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది సిపిఐ పార్టీ అని అన్నారు. ప్రజాస్వామిక హక్కుల కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. నేడు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం 100 సంవత్సరాలుగా కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పని హక్కును ఒక కలం పోటుతో నాలుగు లేబర్ కోడ్లుగా విభజించిందని అన్నారు. అదేవిధంగా పేద ప్రజలకు అంతో ఇంతో ఉపాధి లభిస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కూడా రద్దుచేసి కేవలం ఒక పథకంగా రూపొందించి పేద ప్రజలకు పని దొరక్కుండా చేస్తుందని అన్నారు. అందుకే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న దుర్మార్గా దివాలకోరు విధానాలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తుందని, ఆ పోరాటాలలో ప్రజలు భాగస్వామ్యమై విజయం సాధించుకోవడం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. *ఈ సందర్భంగా సిపిఐ పార్టీలోకి కోక్యతాండ నుంచి 15 కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సమక్షంలో చేరినారు*.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లంల యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి గుగులోతు రాజారాం, ఎస్ కే ఏక్ బాల్, త్రిపురాల శ్రీకాంత్, జంపాల మల్లయ్య, ఇస్లావత్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments