Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 4:43 pm Editor : Admin

ఏసీబీ వలలో దేవాదాయ శాఖ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం.రూ.50 వేల లంచం తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో

హైదరాబాద్‌లో ఫిర్యాదుదారునికి సంబంధించిన ఒక సర్వే నంబర్‌పై సర్వే నివేదిక అందించేందుకు రూ.1,50,000 లంచం డిమాండ్ చేసిన దేవాదాయ శాఖ అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. తెలంగాణ దేవాదాయ కమిషనర్ కార్యాలయంలోని సహాయ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న దేవాదాయ ఇన్స్పెక్టర్ ఆకవరం కిరణ్ కుమార్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)అధికారులకు పట్టుబడ్డాడు.

డిమాండ్ చేసిన మొత్తంలో భాగంగా రూ.50,000 స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇన్స్పెక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు.ఎవరైనా ప్రభుత్వ సేవకులు లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.