పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.
30 సంవత్సరాలకు కరీంనగర్ వేదికగా కలుసుకున్నారు.
గన్నేరువరం, నేటి సత్యం, జనవరి 11..పద్దపెల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యాసంస్థ లో 1995-96 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు. 30 సంవత్సరాల తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ హోటల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సన్మానించుకొని జ్ఞాపికలు అందజేశారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని నేడు వారు ఉన్న స్థితులను ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఆడి పాడి ఆనందంగా గడిపారు. కరస్పాండెంట్ రాళ్ల బండి శంకర్ ప్రసాద్ రెడ్డి, శశికళ మేడం తో పాటు అప్పుడు చదువు చెప్పిన గురువులు కార్యక్రమం నిర్వహించిన గుండు రమేష్ చంద్రశేఖర్ , సమత పావని ల తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.