(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ
ఎన్ టివి ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను వెంటనే విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఐదురోజుల క్రితం ప్రసారమైన వార్త మీద నిన్న సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు పూనుకుంది.
సిట్ విచారణ పూర్తి చేయకుండా నిజాలను తేల్చకుండా,వెంటనే జర్నలిస్టులను అరెస్టు చేయడం,సరైనది కాదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిన్న సాయంత్రం ఎన్ టివి యాజమాన్యం క్షమాపణ కోరినఅప్పటికి, పోలీసులు అరెస్ట్ చేసి ఇంకా అరెస్ట్ చూపకుండ,వాళ్ళను ఎక్కడ ఉంచారో చెప్పకుండా ఉండటం దారుణమని అన్నారు.అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు