(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం మహిమగల దేవుడు మైలారం మల్లికార్జున స్వామి పల్లకిలో ఊరేగారు అంగరంగవైభవంగా మల్లికార్జున స్వామి పల్లకి సేవ.గన్నేరువరం, నేటి సత్యం, జనవరి 17 : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో సుప్రసిద్ధ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జాతరలో భాగంగా రెండవ రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ అత్యంత శుభయమనంగా సాగింది. స్వామివారిని పల్లకిలో మోస్తూ గ్రామ పురవీధుల్లో ఒగ్గుడోలు నృత్యాలు చేస్తూ భక్తులు రకరకాల వేషధారణలో అలరిస్తూ కళాకారులు స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరుశరాములు, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మామిడాల నాగసాయి శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.