Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 January 2026, 12:29 pm Editor : Admin

కలిసి చదువుకోవడమే కాదు కష్టాలను పంచుకుంటాం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చదువుకోవడమే కాదు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకుంటాం

నేటి సత్యం. జనవరి 20

కలిసి చదువుకోవడమే కాదు” కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాం అని, తోటి స్నేహితురాలికి ఆపద ఉందని తెలుసుకొని ఆర్థిక సాయం అందజేశారు 2000-2001 పదవ తరగతి బ్యాచ్ జెడ్ పి హెచ్ ఎస్ మైలార్ దేవ్ పల్లి

మన ఊరి న్యూస్ ప్రతినిధి జనవరి 20 మైలార్ దేవ్ పల్లి: గతంలో మైలార్ దేవ్ పల్లి జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్లో కలిసి చదువుకున్న తోటి విద్యార్థిని, నేడు కష్టాల్లో ఉందని తెలుసుకొని మిత్రులు అందరు కలిసి ఆర్థిక సహాయం అందజేశారు. 2000- 2001 బ్యాచ్ పదవ తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలిసి సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అందరం కలిసి సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు అని తీర్మానించుకున్నారు. తమతోపాటు చిన్నప్పుడు చదువుకున్న ఒకరికి ఆపద ఉందని చెప్పగానే అందరూ కలిసి ఆర్థిక సహాయం (86,000) చేశారు.