(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం సమాజాన్ని చదివించిన దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే – సావిత్రీబాయి పూలే*
*భారత సమాజంలో అజ్ఞానం, కుల వివక్ష, స్త్రీ అణచివేతకు వ్యతిరేకంగా అక్షరాలను ఆయుధంగా మార్చిన దంపతులు జ్యోతిరావు పూలే మరియు సావిత్రీబాయి పూలే.*
*మహాత్మా పూలే ఆలోచనలకు కార్యరూపం ఇచ్చిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే. సమాజం చేసిన అవమానాలు, దాడులు, నిరసనల మధ్య కూడా ఆమె బాలికల విద్యను నిలిపివేయలేదు. జ్యోతిరావు పూలే ఆమెకు భర్తగా మాత్రమే కాదు – సహచరుడిగా, మిత్రుడిగా, సమానత్వానికి నిలువెత్తు మద్దతుగా నిలిచారు.*
*ఈ దంపతుల జీవితం స్త్రీ–పురుష సమానత్వం, విద్యా విముక్తి, సామాజిక న్యాయం అనే విలువలకు చిరునామా. బౌద్ధ మరియు సోషల్ మ్యారేజ్ వేదికపై వారి చిత్రాలు నిలబెట్టడం అంటే – విద్య, సమానత్వం, మానవ గౌరవం మీద నిలబడ్డ వివాహానికి ప్రతిజ్ఞ చేయడమే.*