నేటి సత్యం. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
మండలంలోని ఊరు రా రెపరెపలాడిన జాతీయ జెండా..
గన్నేరువరం,నేటి సత్యం, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం ఘనంగా జరిగాయి తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కనకయ్య, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై జి నరేందర్ రెడ్డి లు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అలాగే మండల కేంద్రంలోని పలు సంఘాలు యాదవ సంఘం, గౌడ సంఘం రజక సంఘం, ఆటో యూనియన్, పలు సంఘాల అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా నియామకమైన సర్పంచులు పాలకవర్గ సభ్యులు వారి వారి గ్రామాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం ఆవశ్యకతను పాఠశాలల్లో విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.