(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చికిత్స పొందుతూ యువకుడు మృతి .
కేసు నమోదు: ఎస్సై బి.నరేష్
తెలకపల్లి నేటి సత్యం జనవరి 29.
చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై బి. నరేష్ అందించిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గట్టురాయిపాకుల గ్రామానికి చెందిన చటమోని బాలకృష్ణ( వయస్సు 27) అనే యువకుడు గత కొంతకాలంగా మధ్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా ఆవారాగా తిరుగుతూ ఉంటే, కుటుంబ సభ్యులు మందలించగా బుధవారం రాత్రి క్షనికావేశంలో తన ఇంట్లో గల పురుగుల మందు త్రాగగా వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకొని పోగా చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.మృతుని తల్లి చటమోని జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. నరేష్ తెలిపారు.
ఫోటో రైట్ అప్4 మృతుడు చటమోని బాలకృష్ణ(27)