ఆర్థిక న్యాయానికి శిల్పి : డా. బి.ఆర్. అంబేడ్కర్
ఆర్థికశాస్త్రంలో డా॥ అంబేడ్కర్ నాకు తండ్రి వంటి వారు. శోషిత వర్గాల కోసం నిరంతరం పాటుపడ్డ నిజమైన ఆదర్శనీయుడు. ఈనాడు ఆయన సాధించిన కీర్తి కంటే ఎన్నో రెట్లు ఆయన ఆర్జించే ఆర్హత పొందాడు. స్వదేశంలో ఆయన వివాదాస్పద వ్యక్తిగా చిత్రించబడినా, నిజానికి ఆయన వివాదాస్పదుడు కాదు. ఆర్థిక శాస్త్రరంగంలో ఆయన మహత్తర కృషి ఎప్పటికీ కొనియాడబడుతూనే ఉంటుంది.”*
డా॥ అమర్త్య సేన్*
*(నోబెల్ లారెట్)*
డా. బి.ఆర్. అంబేడ్కర్ను చాలామంది కేవలం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే చూస్తారు. కానీ ఆయన అసలు మహత్తు – ఆర్థిక శాస్త్రంలో, శోషణకు వ్యతిరేకంగా, సమాన అవకాశాల కోసం చేసిన పోరాటంలో దాగి ఉంది.*
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కులవ్యవస్థ వల్ల ఏర్పడిన అసమానతలను శాస్త్రీయంగా విశ్లేషించిన తొలి మేధావి డా. అంబేడ్కర్. భూమి, నీరు, కార్మిక హక్కులు, ప్రభుత్వ జోక్యం – ఇవన్నీ సామాజిక న్యాయానికి అనుసంధానించకుండా ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు.*
నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తలు డా. అంబేడ్కర్ను తమ గురువుగా భావించడం ఆయన మేధస్సుకు, దూరదృష్టికి నిదర్శనం. వివాదాస్పదుడు కాదు – విప్లవాత్మక ఆలోచనలతో సమాజాన్ని కదిలించిన మహానుభావుడు.*
అరియ నాగసేన బోధి*
(బౌద్ధ రచయిత & సామాజిక విశ్లేషకుడు)*జై భీమ్ జై భారత్*