అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు మృతి
గన్నేరువరం, నేటి సత్యం, ఫిబ్రవరి 5 :
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన విభూది వీరకుమార్(53) సీనియర్ జర్నలిస్టు అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. గ్రామ రేషన్ డీలర్ గా విధులు నిర్వహిస్తూ వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా మండల ప్రజలకు సేవలు అందించారు. మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డబ్ల్యూ జే ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్ మండల పాత్రికేయులు బూర తిరుపతి, ఓడ్నాల తిరుపతి, భీమనాతి వెంకటేష్, నేరెళ్ల నరేష్ గౌడ్, జాలి నరేష్ రెడ్డి ,వినుకొండ లక్ష్మణ్ లు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు.