తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్షులు కే రవిచంద్రన్, రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి ఉజ్జని హరినాథ్ రావు, నిజాంబాద్ జిల్లా ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి ఓమయ్య, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ ఈరోజు తెలంగాణ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ పి.నర్సింగ్ రావు ఈరోజు రోడ్డు దాటుతుండగా ఆటో గుద్దడం జరిగింది. గత పది రోజుల క్రిందట నిజాంబాద్ పట్టణ కేంద్రంలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మార్నింగ్ మరణించడం జరిగింది. కామ్రేడ్ పి.నర్సింగ్ రావు గారికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అంతిమ శివయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.