గిరిజనుడికి మేయర్ పదవి
నేటి సత్యం పాల్వంచ
కొత్తగూడెం కార్పొరేషన్లోని సీపీఐ పార్టీ
అత్యధిక వార్డుల్లో విజయం సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ప్రకటన చేశారు. మేయర్ పదవిని గిరిజనులకే ఇస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్తో ఎలాంటి చర్చలు చేయలేదని.. కేటీఆర్ ఫోన్ చేసి మద్దతు ఇచ్చారన్నారు. కొత్తగూడెంలో ప్రజలు సీపీఐని ఆదరించారన్నారు.