రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలు.. ఐదుగురి మృతి
* రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వారిలో ఐదుగురు మృతి చెందారు. పలు ఆస్పత్రుల్ల్లో చికిత్స పొందుతూ రెండ్రోజుల వ్యవధిలో వీరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఇద్దరు మృతి చెందగా.. ఇవాళ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ సమస్యలతో మరికొంత మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పాలు, నీరు నమూనాలను పరీక్షలకు పంపించారు.