Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 8:27 am Editor : Admin

ఏసీబీ వల్ల లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

4లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌…

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం తీసుకుంటుండగా ఓ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీగా లంచం తీసుకుంటూ అటవీశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సురేష్, ఒక పని నిమిత్తం బాధితుడి నుంచి 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించింది.

సురేష్ తన కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 4 లక్షల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం సురేష్ కార్యాలయం, నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.