ప్రెస్ అకాడమీ చైర్మన్గా రెండవసారి ఎంపిక – శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. టి రామకృష్ణ ( సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు )
నేటి సత్యం హైదరాబాద్ ఫిబ్రవరి 26
ప్రెస్ అకాడమీ చైర్మన్గా రెండవసారి ఎంపికైన శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నేటి సత్యం సిఓ తెలియజేస్తున్నాము. జర్నలిజం రంగంలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ బాధ్యతలను మళ్లీ అప్పగించడం ఎంతో అభినందనీయమైన విషయం.
ప్రెస్ స్వేచ్ఛ, నైతిక విలువలు, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రెస్ అకాడమీ కీలక పాత్ర పోషిస్తోంది. గత పదవీకాలంలో చైర్మన్గా జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణా కార్యక్రమాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేశారు. అదే స్పూర్తితో రెండవసారి కూడా మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాము. అని రామకృష్ణ అన్నారు
రాష్ట్రంలో జర్నలిజం ప్రమాణాలు మరింత ఉన్నత స్థాయికి చేరేందుకు, యువ జర్నలిస్టులకు ప్రోత్సాహం లభించేందుకు ఈ నియామకం దోహదపడుతుందని విశ్వసిస్తున్నాము.
ఈ సందర్భంగా చైర్మన్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము.