కళాకారులకు గుర్తిపు కార్డులు -హెల్త్ కార్డులు ఇవ్వాలి
కున సుధాకర్
తెలంగాణ ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
నేటి సత్యం రంగారెడ్డి మార్చి 2
తెలంగాణ ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో, కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా ప్రతినిధి బృందం, కూన సుధాకర్ ఆధ్వర్యంలో సంబంతదిత అధికారికి వినతి పత్రం అందజేశారు .అనంతరం పల్లె నర్సింహా మాట్లాడుతూ కళాకారులకు గుర్తింపు హెల్త్ కార్డులు ఉద్యోగాలు, కావాలని అంతరించిపోతున్న జానపద ,పౌరాణిక యక్షగాన ,బుర్రకథ ,జాముకుల కథ కోలాటం ,చెక్క భజన కళలను కాపాడాలని సంస్కృతిక రంగానికి బడ్జెట్ కేటాయించాలని కళాకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది…
సాంస్కృతిక రంగం పై అవగాహన కల్పించేందుకు పాఠశాల స్థాయినుండి కళలు సాహిత్యం మీద పాఠాలను బోధించేందుకు ఉపాద్యాయులను నియమించాలి , జిల్లాకేంద్రాలలో మినీ రవీంద్ర భారతి ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని , ప్రత్యేకంగా ఒక సమగ్ర మైన సాంస్కృతిక విధానం అమలు చేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో. తెలంగాణ ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు
.