Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత

గన్నేరువరం మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత

గన్నేరువరం, నేటి సత్యం, మార్చి 4 :

గన్నేరువరం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి సిపిఐ నాయకుల డిమాండ్

ఇసుక కొరత తీర్చాలి: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సరిపడా ఇసుకను ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఇంటి నిర్మాణానికి 20 నుండి 30 ట్రిప్పుల ఇసుక అవసరమవుతుందని, ప్రస్తుతం టోకెన్లు ఉన్నా ఇసుక అందడం లేదని పేర్కొన్నారు.

ప్రైవేటు దోపిడీ: ప్రభుత్వ సరఫరా లేకపోవడంతో లబ్ధిదారులు ప్రైవేటుగా ఇసుక కొనాల్సి వస్తోందని, అక్కడ అడ్డగోలు ధరలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల పర్యవేక్షణ: అధికారులు వెంటనే గ్రామాల్లో పర్యవేక్షించి, నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఇసుక సక్రమంగా అందేలా చూడాలని కోరారు.

రెండో విడత లబ్ధిదారులు: రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారులను తక్షణమే గుర్తించాలని, ‘పరంపోగు’ భూముల సాకుతో ఏళ్ల తరబడి నివసిస్తున్న వారి ఇండ్ల నిర్మాణాలను ఆపవద్దని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ కాంతలా అంజిరెడ్డి,సిపి ఐ మండల కార్యదర్శి చో క్కల శ్రీశైలం, మండల సహాయ కార్యదర్శి లు పి ప్పాల కనకయ్య, కూన మల్లయ్య, గ్రామ కార్యదర్శులు బోయిన మల్లయ్య, మండల నాయకులు ఎండి నాయ్యిమ్, రాపోలు రాయమల్లు, చొక్కాల శ్రీనివాస్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments