Neti Satyam
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 2:57 pm Editor : Admin

ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజల సమస్యలు తీరుతాయి పల్లా వెంకటరెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రజా ఉద్యమాలు బలంగా ఉంటేనే ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరిస్తాయి ః పల్లా వెంకటరెడ్డి

నేటి సత్యం హైదరాబాద్ మార్చి 11

ప్రజా ఉద్యమాలు బలంగాఉంటేనే ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరిస్తాయని ఇందుకు సిపిఐ శ్రేణులు సంసిద్దం కావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి బుదవారం ఆయన మాట్లాడుతూ పొత్తులు కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, ప్రజా సమస్యలపై ఉద్యమించాల్సిందేనన్నారు. ఇందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ఉండడమే మన బలమని ఆ బలాన్ని ప్రజల కోసం వినియోగించాలని సూచించారు. గతంలో సోవియేట్‌ యూనియన్‌ బలంగా ఉన్న రోజుల్లో క్యూబా వైపు కన్నేతి చూసే సహాసం కూడ చేయని అమెరికా నేడు అనేక ఆంక్షలు విధించి వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.