(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు
నేటి సత్యం శేర్లింగంపల్లి మార్చి 13
మార్చి 14, 2026 నుండి ప్రారంభమవుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ముఖ్యమైన మైలురాయి కావున ప్రతి విద్యార్థి ధైర్యంగా, నమ్మకంతో పరీక్షలకు హాజరవాలని సూచిస్తున్నాము.
విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పరీక్షా కేంద్రానికి కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలి. హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. పరీక్షల సమయంలో ఎలాంటి చీటింగ్ లేదా నిబంధనలు ఉల్లంఘించే చర్యలకు పాల్పడకూడదు. ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి సమాధానాలు స్పష్టంగా రాయాలి. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి.
అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ధైర్యం చెప్పి, మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సరైన ఆహారం తీసుకోవాలి.
ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తమ కుటుంబానికి, గురువులకు, సమాజానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము.