(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అతివేగంతో బైక్ను ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి
గన్నేరువరం,నేటి సత్యం, మార్చి 16: గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద సోమవారం రాత్రి 1-30 సమయంలొ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న టాటా పంచ్ కారు, గుండ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న గుండ్లపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రాజకుమార్ వయసు (26 )అనే అతని బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కొమ్ము రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించారు. బైక్పై ఉన్న మరో వ్యక్తి శ్రీకాంత్కు కూడా గాయాలయ్యాయి.
మృతుడి బంధువు వేల్పుల తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన మల్లోజుల అన్వేష్ అనే వ్యక్తిపై గన్నేరువరం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.