Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 10:58 am Editor : Admin

రెండు వేరు వేరు సర్వీస్ రూల్స్ ఉండడం అన్యాయం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విద్యుత్ కార్మికులకు రెండు వేర్వేరు సర్వీస్ రూల్స్ ఉండటం అన్యాయం

ఆర్టిజన్ కార్మికులను రెండో శ్రేణి ఉద్యోగులుగా చూడటం బాధాకరం

బొగ్గు, బూడిదతో అనారోగ్యం పాలవుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యం

ఆర్టిజన్లకు తక్షణమే ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలి

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2026 వేతన సవరణ ఇవ్వాలి

విద్యార్హతను బట్టి ఆర్టిజన్లకు వెంటనే కన్వర్షన్ చేయాలి

కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి

సమస్యలు తీరే వరకు ఆర్టిజన్ల పోరాటానికి పూర్తి మద్దతు

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

ఆర్టిజన్స్ సమ్మె సందర్బంగా పాల్వంచ కెటిపిఎస్ ప్లాంటు ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిభిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు.