(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఏప్రిల్ 10..42 మంది మావోయిస్టుల లొంగుబాటు*
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారు. సుమారు 40 ఆయుధాలను మావోయిస్టులు పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో ఎక్కువమంది ఛత్తీస్గఢ్ క్యాడర్ మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్ పెరగడంతో వీరంతా తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందిన వారున్నారు.